బాలుడికి రక్తదానం చేసిన డాక్టర్ అజీమ్
NEWS Apr 20,2025 09:33 pm
మెట్ పల్లి పట్టణంలోని పదేళ్ల బాలుడు పుశ్విత్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. 20 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించుకోవాలి. హాస్పిటల్ లో ఉన్న బాలుడికి మెట్ పల్లి పట్టణంలోని కేర్ ఫిజియోథెరపి హాస్పిటల్ డా. అజీమ్ స్వచ్చందంగా బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి రక్తదానం చేశారు. పుశ్విత్ కు డా.అజీమ్ ఇప్పటికి 2 సార్లు రక్తదానం చేశారు.