అవేశ్ ఖాన్ సంచలనం రాజస్థాన్ పరాజయం
NEWS Apr 20,2025 01:22 am
ఈసారి ఐపీఎల్ టోర్నీ రాజస్థాన్ రాయల్స్ కు కలిసి రాలేనట్టుంది. మొన్న సూపర్ ఓవర్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ఓటమి పాలైంది. ఇవాళ జరిగిన కీలక పోరులో చేతులెత్తేసింది. చేతిలో వికెట్లు ఉన్నా టార్గెట్ ను ఛేదించలేక పోయింది. పరాజయాన్ని మూటగట్టుకుంది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైశ్వాల్ , రియాన్ పరాగ్ మెరిసినా ఓటమి నుంచి కాపాడలేక పోయారు. సంజూ శాంసన్ గాయం కారణంగా తప్పుకున్నాడు. పరాగ్ స్టాండింగ్ కెప్టెన్ గా ఉన్నాడు. ఆఖరిలో అవేశ్ ఖాన్ రాజస్థాన్ పతనాన్ని శాసించాడు. 37 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. దీంతో లక్నో రాయల్స్ పై 2 రన్స్ తేడాతో గెలుపొందింది.