Logo
Download our app
జేఈఈ (మెయిన్‌) సెషన్‌ -2 ఫలితాలు రిలీజ్
NEWS   Apr 19,2025 07:21 am
ఉత్కంఠ‌కు తెర దించుతూ జేఈఈ (మెయిన్‌) సెషన్ -2 ఫలితాలు వెల్ల‌డయ్యాయి. ఎన్టీఏ ఫైన‌ల్ కీ విడుద‌ల చేశారు. విద్యార్థులు సాధించిన పర్సంటైల్‌ స్కోరుతో రిజ‌ల్ట్స్ ను ప్ర‌క‌టించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీఈ/ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్‌ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్‌ -1 పరీక్షలు నిర్వహించారు. ఈ ఫ‌లితాల‌లో ఇరు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన న‌లుగురు విద్యార్థులు 100 ప‌ర్సంటైల్ సాధించారు. జేఈఈ మెయిన్‌ పరీక్షలకు దేశ వ్యాప్తంగా 10,61,849 మంది రిజిస్టర్‌ చేసుకోగా 9,92,350 మంది హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 24మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ స్కోరుతో అదరగొట్టారు.
⚠️ You are not allowed to copy content or view source