Logo
Download our app
విచార‌ణ పేరుతో వేధించారు
NEWS   Apr 19,2025 06:37 am
విచార‌ణ పేరుతో పోలీసులు త‌న‌ను ఉద‌యం పిలిచి రాత్రి వ‌ర‌కు కూర్చోబెట్టార‌ని వాపోయారు బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా ఇన్ ఛార్జ్ మ‌న్నె శ‌శాంక్. తిరిగి 23వ తేదీన నాలుగో సారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చార‌న్నారు. విచారణ పేరుతో రేవంత్ ప్రభుత్వం వేధిస్తోంద‌ని ఆరోపించారు. HCU అడవుల్లో జింకలు చనిపోయాయని.. ఆ భూములపై రేవంత్ రెడ్డి భూదందా చేశాడని, రూ.10 వేల కోట్లు అప్పు తీసుకున్నాడని సీఈసీ చెప్పిందన్నారు . 1524 చెట్లు కొట్టేశారని సీఈసీ నివేదిక ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తుంటే, ఆయన త‌మ‌ను టార్గెట్ చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.
⚠️ You are not allowed to copy content or view source