భూ భారతిని అడ్డుకునే ప్రయత్నం చేశారు
NEWS Apr 18,2025 02:05 pm
రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో రైతు సదస్సులు పెట్టి ఉంటే వీపు విమానం మోత మోగేదన్నారు. అసెంబ్లీలో వీధి రౌడీల్లా భూ భారతి చట్టాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు. రెండు పర్యాయాలు చెంప చెల్లుమనేట్లు ప్రజలు తీర్పు ఇచ్చినా వారికి జ్ఞానోదయం కాలేదన్నారు. పేదల కన్నీటిని తుడిచేందుకు భూ భారతిని తీసుకువచ్చామన్నారు.