గురుకులం విద్యార్థులకు అస్వస్థత
NEWS Apr 15,2025 07:49 pm
కోరుట్ల పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 7వ తరగతికి చెందిన 11 మంది విద్యార్థులు జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురుకుల పాఠశాలలోని పరిసర ప్రాంతాల కారణంగా విద్యార్థులు జ్వరంతో బాధపడుతున్నారా.. అన్నది తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తుంది. ఒకేసారి ప్రైమరీ తరగతులకు చెందిన 6, 7, 8 తరగతుల విద్యార్థులు జ్వరాలతో బాధపడడం ఆందోళన కలిగిస్తుంది.