ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్
NEWS Apr 15,2025 06:10 pm
శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ జోనల్ కార్యాయంలో ఏసీబీ సోదాలు దాడులు చేసింది. అర్బన్ బయో డైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ విప్పర్ల శ్రీనివాస్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. చెక్ మెజర్డ్ బిల్లులను ఆమోదింప చేసేందుకు రూ. 2,20,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మొదటి విడతగా రూ.1,50,000 తీసుకున్నాడు. మిగిలిన రూ. 70,000 తీసుకుంటుండగా అనిశా అధికారులకు చిక్కాడు. ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని కోరింది ఏసీబీ.