టీటీడీపై దుష్ప్రచారం తగదు - అనిత
NEWS Apr 15,2025 05:48 pm
తిరుమల అంశంలో అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు హోం మంత్రి అనిత. ఈ విషయంలో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. గతంలో టీటీడీ ఛైర్మన్గా పని చేసిన భూమన కరుణాకర్ రెడ్డి కావాలని బురద చల్లేందుకు ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఈ వ్యవహారంలో ఎలాంటి నిజాలు లేవని స్వయంగా ఈఓ శ్యామలరావు స్పష్టం చేశారని తెలిపారు.