ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు ఓకే
NEWS Apr 15,2025 04:08 pm
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మూడు గంటలకు పైగా సాగింది. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదించింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు ఆమోదం తెలిపింది. అభివృద్ది, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్బంగా స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.