త్వరలో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
NEWS Apr 15,2025 02:35 pm
ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 20 వేల ఖాళీల భర్తీకి ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందులో టీజీపీఎస్సీ, పోలీసు, గురుకుల, వైద్య, నియామక సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.