సర్కార్ ను కూల్చేందుకు తండ్రీకొడుకుల కుట్ర
NEWS Apr 15,2025 02:22 pm
తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆ కుర్చీ మీదనే వారికి ధ్యాస ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలు పదే పదే కూలుస్తామంటున్నారని ఆరోపించారు. దమ్ముంటే ఎంత మంది ఎమ్మెల్యేలను కొంటారో కొనాలని సవాల్ విసిరారు. కేసీఆర్ ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డి అంటూ కామెంట్ చేశారు. తాటాకు చప్పుళ్లకు తాము భయపడేది లేదన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా భూభారతి అమలు చేసి తీరుతామన్నారు.