Logo
Download our app
రూ. 6.60 కోట్ల కిరీటాలు విరాళం
NEWS   Apr 12,2025 09:02 am
ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామ‌స్వామి వారికి భారీ ఎత్తున విరాళం అందింది. పెన్నా సిమెంట్ అధినేత పి. ప్రతాప్ రెడ్డి తన కుటుంబంతో కలిసి మూడు బంగారు కిరీటాలను విరాళంగా ఇచ్చారు.7 కిలోల బరువున్న, దాదాపు రూ. 6.60 కోట్ల విలువైన రాళ్ళు పొదిగిన బంగారు కిరీటాలను సమర్పించారు. పూజలు నిర్వహించిన తర్వాత గర్భగుడిలోని శ్రీ సీతారామ లక్ష్మణుడి ప్రధాన దేవతలకు అలంకరించారు. టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈఓ జె. శ్యామలరావు పెన్నా సిమెంట్ కుటుంబ సభ్యులను సత్కరించారు. టిటిడి అధికారులు, ఇతర భక్తులు కూడా హాజరయ్యారు.
⚠️ You are not allowed to copy content or view source