Logo
Download our app
చెన్నై సూప‌ర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా ధోనీ
NEWS   Apr 10,2025 07:15 pm
చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు యాజ‌మాన్యం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఐపీఎల్ 2025 మెగా టోర్నీ నుంచి ప్ర‌స్తుతం జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. దీంతో ఈ 18వ మెగా సీజ‌న్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. తను అందుబాటులో లేని కార‌ణంగా ప్ర‌స్తుతం వికెట్ కీప‌ర్ గా ఉన్న మాజీ స్కిప్ప‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు స్ప‌ష్టం చేసింది . ఈ విష‌యాన్ని జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ధ్రువీక‌రించారు.
⚠️ You are not allowed to copy content or view source