Logo
Download our app
మోహినీ అలంకారంలో జగన్మోహనుడు
NEWS   Apr 10,2025 11:50 am
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా ఐదో రోజు గురువారం మోహినీ అలంకారంలో రాముల వారు జగన్మోహనాకారుడిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు.ఉదయం 7.30 గంటలకు స్వామివారి ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source