Logo
Download our app
మార్కెట్ యార్డులో ఓఆర్‌ఎస్ పంపిణీ
NEWS   Apr 10,2025 10:24 am
మెట్‌పల్లి: వ్యవసాయ మార్కెట్ కమిటి, మార్కెట్ యార్డు ఆవరణలో ఏఎంసీ చైర్మన్ కూన గోవర్ధన్ రైతులకు, హమాలీ, చాటా కార్మికులకు ఎండా కాలం దృష్ట్యా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. చైర్మన్ మాట్లాడుతూ మార్కెట్ యార్డులో పనిచేసే కార్మికులకు ఎండలో నీరసించి పోకుండా ప్రతి ఒక్కరికి ఓఆర్‌ఎస్, పాకెట్లు అంస్తున్న‌ట్టు తెలిపారు. కార్యదర్శి ఇంద్రసేన రెడ్డి, పర్యవేక్షకులు హరికృష్ణ, హమాలీ అధ్యక్షులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source