Logo
Download our app
స‌న్ రైజ‌ర్స్ ప‌రాజ‌య ప‌రంప‌ర
NEWS   Apr 07,2025 10:44 am
ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. బ‌ల‌మైన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. స్టార్ పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ సూప‌ర్ షో చేశాడు. ఏకంగా 4 వికెట్లు కూల్చాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ ఆర్ హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 152 ర‌న్స్ మాత్ర‌మే చేసింది. సాయి కిషోర్ 2 , ప్ర‌సిద్ద్ కృష్ణ 2 వికెట్లు కూల్చారు. నితీశ్ రెడ్డి 31 ర‌న్స్ చేశాడు. టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంత‌రం బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ ఆరంభంలోనే 16 ప‌రుగుల‌కే 2 వికెట్లు కోల్పోయింది. వాషింగ్ట‌న్ సుంద‌ర్ 29 బంతులు ఆడి 49 ర‌న్స్ చేశాడు. శుభ్ మ‌న్ గిల్ 43 బంతుల్లో 61 ప‌రుగులు చేశాడు.
⚠️ You are not allowed to copy content or view source