Logo
Download our app
అగ్ని ప్రమాదంపై విచారణ చేస్తాం
NEWS   Apr 04,2025 03:07 pm
హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సచివాలయంలోని రెండో బ్లాక్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై విచారణకు ఆదేశించామని వెల్లడించారు. అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని ఆమె పరిశీలించారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడి ఘటన పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యాటరీల నుంచి పొగలు రావడాన్ని ఎస్పీఎఫ్ సిబ్బంది గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారన్నారు. కేవలం 10 నిమిషాలలోపే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారన్నారు.
⚠️ You are not allowed to copy content or view source