Logo
Download our app
జాస్ బ‌ట్ల‌ర్ జోష్ మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ జోరు
NEWS   Apr 03,2025 08:37 am
ఐపీఎల్ 2025 టోర్నీలో స్వంత గ‌డ్డ‌పై బిగ్ షాక్ త‌గిలింది ఆర్సీబీకి. బెంగ‌ళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్ లో బోల్తా ప‌డింది. గుజ‌రాత్ టైటాన్స్ దెబ్బ‌కు విల విల లాడింది. హైద‌రాబాద్ పేస‌ర్ సిరాజ్ అద్భుత‌మైన బౌలింగ్ , జోస్ బ‌ట్ల‌ర్ విధ్వంస‌క‌ర‌మైన ఇన్నింగ్స్ తో గుజ‌రాత్ టైటాన్స్ ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. గెలుపు బాట‌లో ఉన్న బెంగ‌ళూరుకు బ్రేక్ వేసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి చుక్క‌లు చూపించాడు సిరాజ్. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 169 ర‌న్స్ చేసింది. అనంత‌రం మైదానంలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ 2 వికెట్లు కోల్పోయి గెలుపొందింది.
⚠️ You are not allowed to copy content or view source