ఇప్పట్లో రిటైర్మెంట్ చేసే ప్రసక్తి లేదు
NEWS Apr 02,2025 07:37 am
భారత క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన చేశారు. తాను రిటైర్ అవుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించాడు. తనలో ఇంకా ఆడే సత్తా ఉందన్నాడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నాడు. ఒన్డే ఫార్మాట్ లో దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్ షిప్ లో సత్తా చాటానని , ఇంతకంటే ఇంకేం కావాలంటూ ప్రశ్నించాడు. ఇప్పట్లో తాను ఒన్డే ఫార్మాట్ నుంచి తప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా గత ఏడాది విండీస్ లో ముగిసిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను భారత్ కైవసం చేసుకుంది. అనంతరమే ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు విరాట్ కోహ్లీ.