Logo
Download our app
బహుభాషల అధ్యయనం ఎంతో మేలు
NEWS   Apr 01,2025 06:31 am
విభిన్న భాషలు నేర్చుకోవడం వ్యక్తిగతంగా ఎంతో ప్రయోజనకరమని, దానివల్ల భాషకు ప్రత్యేకమైన ప్రయోజనం ఉండబోదని విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. అమెరికా బే ఏరియాలో సిలికానాంధ్ర నిర్వహించిన వేడుకల్లో యార్లగడ్డ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రం జాతీయ ఐక్యతకు సహాయ పడుతుందని చెప్పారు. ఈ ప్రతిపాదనలో హిందీని తప్పనిసరి చేయలేదని, అయితే మాతృ భాషతో పాటు మరో భారతీయ భాషను అధ్యయనాన్ని ప్రోత్సహించడమే దీని ఉద్దేశమని ఆయన స్పష్టం చేసారు. ఏ భాషను నేర్చుకోవాలనేది పూర్తిగా తల్లిదండ్రులు, విద్యార్థులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source