Logo
Download our app
స‌మ ఉజ్జీల మ‌ధ్య పోరుకు రెఢీ
NEWS   Mar 28,2025 08:53 am
ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా స‌మ ఉజ్జీల మ‌ధ్య కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ సిద్ద‌మైంది. నువ్వా నేనా అన్న రీతిలో ఇరు జ‌ట్లు ఢీకొనేందుకు రెడీ అయ్యాయి. ఇరు జ‌ట్లు తొలి మ్యాచ్ లో గెలుపొంది స‌మంగా ఉన్నాయి. తొలి మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ అద్భుతంగా ఆడింది. ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టును ఓడించింది. టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో కోల్ క‌తా వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అద్భుతంగా ఆడింది. స్వంత మైదానంలో ఓడించింది. కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇక ఈ కీల‌క మ్యాచ్ మార్చి 28న వేదిక కానుంది. ఇరు జ‌ట్లు అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ బ‌లంగా ఉన్నాయి. దీంతో పోరు మాత్రం మ‌రింత ఉత్కంఠ‌ను రేప‌నుండ‌డం ఖాయం. ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.
⚠️ You are not allowed to copy content or view source