ప్రవీణ్ పగడాల మృతిపై విచారణ చేపట్టాలి
NEWS Mar 26,2025 06:41 pm
ఏపీలో క్రైస్తవ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పాస్టర్ గా గుర్తింపు పొందారని, ఆయన హఠాత్తుగా మృతి చెందడం పట్ల కుటుంబీకులు అనుమానాలు వ్యక్తం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులు ఆయన మృతి పట్ల ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా సమగ్ర విచారణ కొనసాగించాలన్నారు. మంత్రి వంగలపూడి అనిత స్పందించి పారదర్శకంగా కేసును ఛేదించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ప్రవీణ్ పగడాలకు నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు.