టీటీడీ చైర్మన్ కు పీఠాధిపతుల ఆశీర్వాదం
NEWS Mar 26,2025 09:20 am
పాలిమారు మఠం పీఠాధిపతి విద్యాదీశ తీర్థ స్వామిజీ, భీమనకట్టె మఠం పీఠాధిపతి రఘువరేంద్ర తీర్థ స్వామిజీలను తిరుమలలోని వ్యాసరాజ మఠంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు. భక్తులు సంతృప్తిగా తిరుమల యాత్రను పూర్తి చేసుకునేలా టీటీడీ పని చేయాలని పీఠాధిపతులు చైర్మన్ కు సూచించారు. శ్రీవారి అనుగ్రహంతో టీటీడీ తలపెట్టే అన్ని కార్యక్రమాలు సఫలీకృతం కావాలని స్వామీజీలు ఆశీస్సులు అందజేశారు.