Logo
Download our app
ఐపీఎల్ తొలి మ్యాచ్ కోల్ క‌తా వ‌ర్సెస్ బెంగ‌ళూరు
NEWS   Mar 22,2025 11:26 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్ క‌తాలోని ఈడెన్ గార్డ్స్ వేదిక‌గా కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు ఓపెనింగ్ మ్యాచ్ ఆడ‌నున్నాయి. గ‌త ఏడాది ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో కేకేఆర్ ఐపీఎల్ విజేత‌గా నిలిచింది. ఈసారి ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియ‌న్ తో త‌ల‌ప‌డ‌నుంది. ఆర్సీబీ జ‌ట్టు బ‌లంగా ఉంది. విరాట్ కోహ్లీ కీల‌కంగా మార‌నున్నాడు. ఇటీవ‌ల ఛాంపియ‌న్స్ ట్రోఫీలో దుమ్ము రేపాడు. ఈ రెండు జట్లు మొదటిసారి 2008లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ప్రారంభ ఐపీఎల్ మ్యాచ్ సమయంలో ఒకదానికొకటి తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కేకేఆర్ గెలుపొందింది. ఈ మ్యాచ్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది.
⚠️ You are not allowed to copy content or view source