Logo
Download our app
చాహ‌ల్..ధ‌న‌శ్రీ‌ల‌కు విడాకులు మంజూరు
NEWS   Mar 20,2025 07:17 pm
భార‌త క్రికెట్ జ‌ట్టు స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ , ధ‌న‌శ్రీ వ‌ర్మ‌ల‌కు ముంబై ఫ్యామిలీ కోర్టు గురువారం విడాకులు మంజూరు చేసింది. చాహ‌ల్ న్యాయ‌వాది నితిన్ కుమార్ గుప్తా విచార‌ణ అనంత‌రం ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. కోర్టు డివోర్స్ ను మంజూరు చేసింది. కోర్టు రెండు పార్టీల ఉమ్మ‌డి పిటిష‌న్ ను అంగీక‌రించింద‌న్నారు. ఇక నుంచి వారు విడి పోయిన‌ట్లేన‌ని తెలిపారు. కాగా చాహ‌ల్ , వ‌ర్మ డిసెంబ‌ర్ 2020లో పెళ్లి చేసుకున్నారు. జూన్ 2022లో విడి పోయారు. ఫిబ్ర‌వ‌రి 5న ప‌రస్ప‌ర అంగీకారంతో విడాకులు కోరుతూ కుటుంబ కోర్టులో ఉమ్మ‌డి పిటిష‌న్ దాఖ‌లు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source