Logo
Download our app
బెట్టింగ్ యాప్ కేసుపై దేవ‌ర‌కొండ‌ టీమ్ స్పంద‌న‌
NEWS   Mar 20,2025 04:09 pm
టాలీవుడ్ లో తాజాగా బెట్టింగ్ యాప్స్ కేసు క‌ల‌క‌లం రేపుతోంది. ఇందులో ప‌లువురు న‌టీన‌టులు చిక్కుకున్నారు. ఈ సంద‌ర్బంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై కేసు న‌మోదు చేసిన ఘ‌ట‌న‌పై త‌న టీం స్పందించింది. చ‌ట్ట ప్ర‌కారం నిర్వ‌హిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్ మాత్ర‌మే న‌టుడు ప్ర‌క‌ట‌న‌లు చేశాడ‌ని తెలిపింది. త‌ను ఏ యాడ్ చేసినా , ఏ కంపెనీకి ప్ర‌చార‌క‌ర్త‌గా ఉన్నా ఆ కంపెనీ, సంస్థ‌ల‌ను ప‌రిశీలిస్తామ‌ని, లీగ‌ల్ గా అన్నీ క‌రెక్టుగా ఉంటేనే ఒప్పుకుంటాడ‌ని స్ప‌ష్టం చేసింది. ప‌ర్మిష‌న్ ఉన్న ఏ23 అనే సంస్థ‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నాడ‌ని, ఈ ఒప్పందం గ‌త ఏడాదితో ముగిసింద‌ని తెలిపింది.
⚠️ You are not allowed to copy content or view source