Logo
Download our app
నిజామాబాద్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
NEWS   Mar 16,2025 04:48 pm
నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణం కంటే ఎక్కువగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఉదయం 10 గంటలకే ఎండల ప్రభావం కూడా స్పష్టంగా తెలిసిపోతోంది. 40డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో మధ్యాహ్నం రోడ్డుపైకి వెళ్లాలంటే భయపడి అడుగు ముందుకు పడటం లేదని వాపోతున్నారు. ఎండల ధాటికి జనం రోడ్లపైకి రాకుండా ఇంటి పట్టునే ఉంటున్నారు. మామూలు రోజుల్లో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు సైతం పగటి పూట బోసిపోయి ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source