Logo
Download our app
సైద్ధాంతిక పోరాటమే జనసేన బలం
NEWS   Mar 15,2025 08:42 am
సైద్ధాంతిక పోరాట‌మే జ‌న‌సేన పార్టీ బ‌ల‌మ‌ని అన్నారు డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప్రజలకు మేలు చేసే మార్పును జనసేన కోరుకుంటుంద‌న్నారు. దేశ గతిని మార్చే యువ నాయకత్వాన్ని అందించడమే త‌న క‌ల అని పేర్కొన్నారు. సనాతన ధర్మం అంటే సమాజంలో అందరికీ మేలు జరగాలని కోరుకోవడమేన‌ని అన్నారు. దేశంలో బహు భాషల అవసరం ఉందని స్ప‌ష్టం చేశారు. ఉత్తరాది, దక్షిణాది అని పదేపదే మాట్లాడటం సబబు కాదన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ అవసరమ‌ని స్ప‌ష్టం చేశారు. దేశాన్ని ముక్కలు చేసే ఆలోచనలు తప్పు అని అన్నారు.సెక్యూలరిజం పేరుతో ఒక్కోక్కరికి ఒక్కో న్యాయం అంటే ఎలా అని ప్ర‌శ్నించారు.
⚠️ You are not allowed to copy content or view source