Logo
Download our app
ఉచిత సిలిండర్ పై కీల‌క ప్ర‌క‌ట‌న
NEWS   Mar 14,2025 10:18 am
ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దీపం -2 ప‌థ‌కం కింద ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ ఇప్ప‌టికీ తీసుకోని వారికి పౌర స‌ర స‌ర‌ఫ‌రాల శాఖ క‌మిష‌న‌ర్ సౌర‌భ్ గౌర్ కీల‌క సూచ‌న‌లు చేశారు. ఈ నెలాఖరులోగా మొదటి సిలిండర్ ను వెంట‌నే బుక్ చేసుకోవాలని, లేదంటే మూడు సిలిండర్లలో మొదటి సిలిండ‌ర్ ఛాన్స్ కోల్పోతారని తెలిపారు. ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్ ప్రారంభం అవుతుంద‌న్నారు.. ఈ పథకం కింద ఇప్పటి వరకు 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు.
⚠️ You are not allowed to copy content or view source