Logo
Download our app
ఎమ్మెల్సీగా దాసోజు శ్ర‌వ‌ణ్ ఏక‌గ్రీవం
NEWS   Mar 13,2025 07:55 pm
ఎమ్మెల్యే కోటా కింద బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఎన్నిక ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని గురువారం శాస‌న మండ‌లి కార్య‌ద‌ర్శి ఆయ‌న‌కు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి ఎం. రమేష్ కుమార్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు. నూత‌న ఎమ్మెల్సీగా ఎన్నికైన దాసోజును ప్ర‌త్యేకంగా అభినందించారు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ రావు, శ్రీ‌నివాస్ గౌడ్, పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్.
⚠️ You are not allowed to copy content or view source