Logo
Download our app
17 జిల్లాల్లో భానుడి ప్ర‌తాపం
NEWS   Mar 13,2025 09:34 am
తెలంగాణ వాసుల‌కు తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేసింది రాష్ట్ర వాతావ‌ర‌ణ శాఖ‌. గురువారం నుంచి ఈనెల 18వ తేదీ వ‌ర‌కు వ‌డ గాలులు వీస్తాయ‌ని ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వనపర్తి, గద్వాల్, నారాయణపేట్ జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది.
⚠️ You are not allowed to copy content or view source