Logo
Download our app
కోటరీ వల్లే జగన్కు దురమయ్యా
NEWS   Mar 12,2025 05:21 pm
మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కోట‌రీ వ‌ల్ల‌నే తాను జ‌గ‌న్ నుంచి దూర‌మ‌య్యాన‌ని అన్నారు. మీ మనసులో నాకు స్థానం లేదని.. అందుకే పార్టీని వీడుతున్నానని చెప్పానని స్ప‌ష్టం చేశారు. మీ చుట్టూ ఉన్న వాళ్ల మాటలు వినొద్దని జగన్కు చెప్పాన‌ని తెలిపారు. నా మనసు విరిగి పోయింది కాబట్టే పార్టీ నుంచి బయటకు వచ్చాన‌ని అన్నారు. విరిగిన మనసు మళ్లీ అతుక్కోదని, తాను తిరిగి వైసీపీలో చేరే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. జగన్ నన్ను పార్టీలో ఉండమన్నారు. కానీ మ‌న‌సు ఒప్ప‌డం లేద‌న్నారు. జ‌గ‌న్ కు ఈ కేసుతో ప్ర‌మేయం లేద‌న్నారు. తాను ప్ర‌లోభాల‌కు లొంగి పోయాన‌ని మా నేత అన‌డం బాధ క‌లిగించింద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source