Logo
Download our app
వనదేవతలను దర్శించుకున్న గవర్నర్
NEWS   Mar 11,2025 10:56 pm
ములుగు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం డోలి వాయిద్యాలతో ఆదివాసీ పూజారులు, ఎండోమెంట్ అధికారులు గవర్నర్‌కు ఘన స్వాగతం పలికారు. సమ్మక్క, సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజులు, నాగులమ్మలను దర్శించుకుని గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source