బెదిరింపులకు పాలపడుతున్న వ్యక్తిపై ఫిర్యాదు
NEWS Mar 08,2025 10:38 am
నిజామాబాద్ లోని న్యూ బ్యాంకు కాలనీ ఓ కులస్తులకు చెందిన స్థలం విషయంలో తమపై బెదిరింపులకు పాలపడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. రైల్వే కమాన్, కంటేశ్వర్ మాల సంఘం సభ్యులు మాట్లాడుతూ..నిజామాబాద్ లోని న్యూ బ్యాంకు కాలనీలో కాలనీ వాసులు అవసరార్ధం వదిలివేసిన భూమి సర్వే నెం 374 గల స్థలం మాల కులంకు చెందిన చిన్న నీలయ్య కు చెందినదని తెలిపారు.