Logo
Download our app
అంబేద్క‌ర్ విగ్ర‌హానికి అవ‌మానం
NEWS   Mar 07,2025 11:20 am
సారంగపూర్ మండలం నగునూర్ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన ఘ‌ట‌న‌పై ద‌ళిత సంఘాలు భ‌గ్గుమంటున్నాయి. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డ‌వారిపై క‌ఠిన చర్యలు తీసుకోవాల‌ని మల్లాపూర్ మండలం దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇది యావత్ దేశాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అంబేద్కర్ సంఘాల మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు సుద్దాల నాగరాజు, దళిత సంఘాలు నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source