Logo
Download our app
రెస్టారెంట్ల‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
NEWS   Mar 07,2025 04:16 pm
ఫుడ్ సేఫ్టీ అధికారులు హైద‌రాబాద్ లోని అమీర్ పేట్, టోలిచౌకిలో త‌నిఖీలు చేప‌ట్టారు . అమీర్ పేట్ లోని తాజా కిచెన్, అమోఘ హోటల్, టొలిచౌకి లోని 4 సీజన్ మల్టి కజిన్ రెస్టారెంట్ల పై దాడులు నిర్వ‌హించారు. తుప్పు పట్టిన కత్తులతో పాడై పోయిన‌ కూరగాయలు, నాన్ వెజ్ కట్ చేస్తున్న‌ట్లు గుర్తించారు . అంతే కాకుండా ప్ర‌మాద‌క‌ర‌మైన సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారని తెలిపారు. కిచెన్ ప‌రిస‌ర ప్రాంతాల‌న్నీ అప‌రిశుభ్రంగా ఉన్నాయ‌న్నారు. కిచెన్ లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నాయ‌ని, వెజ్ , నాన్ వెజ్ ను ఒకే చోట నిలువ ఉంచుతున్నార‌ని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source