పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం
NEWS Mar 06,2025 08:06 am
మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించినట్లు ప్రకటించారు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అంజి రెడ్డికి అందించారు. అంజిరెడ్డి ఎమ్మెల్సీగా గెలవడంతో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం బయట బిజెపి శ్రేణులు బండి సంజయ్ తో కలిసి సంబరాలు నిర్వహించారు.