Logo
Download our app
తెలంగాణ‌లో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం
NEWS   Mar 05,2025 09:04 am
ఇవాల్టి నుంచి తెలంగాణ‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు ప్రారంభం అయ్యాయి. సెకండ్ లాంగ్వేజ్ ప‌రీక్ష‌కు సెట్-బి ప్ర‌శ్నాప‌త్రం ఉంటుంది. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష జ‌రుగుతుంది. ఈ ప‌రీక్ష‌కు 9 ల‌క్ష‌ల 96 వేల 971 మంది విద్యార్థులు హాజ‌రు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1532 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. 40 నిమిషాల ముందు నుంచే విద్యార్థుల‌ను కేంద్రాల లోప‌లికి అనుమ‌తి ఇస్తున్నారు. కాగా 9.05 నిమిషాల వ‌ర‌కే టైమ్ ఉంటుంద‌ని, ఆ త‌ర్వాత అనుమ‌తించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి.
⚠️ You are not allowed to copy content or view source