Logo
Download our app
మ‌హిళా సంఘాల‌కు ఆర్టీసీ అద్దె బ‌స్సులు
NEWS   Mar 04,2025 01:21 pm
ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మ‌హిళా సంఘాల‌కు తీపి క‌బురు చెప్పింది. ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఇచ్చిన హామీ మేర‌కు ఆర్టీసీ అద్దె బ‌స్సుల‌ను కేటాయిస్తూ జీవో జారీ చేసింది. తొలి విడ‌త‌లో 150 మండ‌ల మ‌హిళా స‌మాఖ్య‌ల‌కు 150 ఆర్టీసీ అద్బె బ‌స్సుల‌ను కేటాయించింది. మిగ‌తా మండ‌ల స‌మాఖ్య‌ల‌కు 450 ఆర్టీసీ అద్దె బ‌స్సుల‌ను కేటాయించ‌నున్న‌ట్లు తెలిపింది. ప్ర‌తి నెలా ఒక్కో అద్దె బ‌స్సుకు రూ. 77 వేల 220 రూపాయ‌లు చెల్లించ‌నుంది టీజీఆర్టీసీ. బ‌స్సుల కొనుగోలు కోసం మ‌హిళా సంఘాల‌కు బ్యాంకు గ్యారంటీ ఇవ్వ‌నుంది స‌ర్కార్. మ‌హిళా సంఘాల‌కు బ‌స్సుల‌ను కేటాయించ‌డం దేశంలోనే తొలిసారి కావ‌డం విశేషం.
⚠️ You are not allowed to copy content or view source