Logo
Download our app
సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
NEWS   Mar 03,2025 11:18 pm
మెట్‌ప‌ల్లి: సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఆర్ఎస్ఐ కృష్ణ చెప్పారు. మెట్‌ప‌ల్లి పట్టణంలోని ఓ ప్రవేట్ డిగ్రీ కళాశాలలో పలు విషయాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడుతూ.. మొబైల్ ద్వారానే 80% సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు. పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలకు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి రాములు, సిఐ నిరంజన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source