Logo
Download our app
ప్ర‌జ‌ల్లో డిజిట‌ల్ అక్ష‌రాత‌స్య పెంపొందించాలి
NEWS   Mar 03,2025 08:03 pm
రాష్ట్రంలోని ప్ర‌తి పౌరుడూ డిజిట‌ల్ అక్ష‌రాస్యుడిగా మారాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త క‌లిగిన రాష్ట్రంగా తీర్చి దిద్దాల‌ని, ఆ దిశ‌గా అధికారులు కృషి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. పీపుల్స్ ప‌ర్సెప్ష‌న్‌, ఆర్టీజీఎస్ పైన స‌చివాలయంలో స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ప్ర‌గ‌తి గురించి ఆరా తీశారు. ప్ర‌జ‌లంద‌రూ వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ సుల‌భంగా ఉప‌యోగించుకునేలా చూడాల‌న్నారు. ప్ర‌భుత్వం నుంచి ఏ సేవ కావాల‌న్నా అధికారులు, కార్య‌ల‌యాల చుట్టూ తిర‌గాల్సిన అవ‌స‌రం లేకుండా చేశామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source