Logo
Download our app
విజయవాడ డివిజన్‍లో పలు రైళ్లు రద్దు
NEWS   Mar 02,2025 03:01 pm
ట్రాక్ ప‌నుల కార‌ణంగా విజ‌య‌వాడ రైల్వే డివిజ‌న్ లో ప‌లు రైళ్లు ర‌ద్దు చేసిన‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టించింది. క‌డియం, ద్వారపూడి, అనపర్తి, విజయవాడ లైన్‍లో ట్రాక్ ఇంటర్ లాకింగ్ పనులు కొన‌సాగుతున్నాయి. గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్ ప్రెస్ (17239) , నేడు, రేపు విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్ ప్రెస్ (17240) రద్దు చేశారు. విశాఖ-గుంటూరు, గుంటూరు-విశాఖ ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైళ్లు, విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్ (12805) రద్దయ్యాయి. రేపు లింగంపల్లి-విశాఖ జన్మభూమి ఎక్స్ ప్రెస్ (12806) రద్దయింది.
⚠️ You are not allowed to copy content or view source