Logo
Download our app
కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న సస్పెన్షన్‌
NEWS   Mar 01,2025 01:04 pm
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న సస్పెండ్‌ అయ్యారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో తీన్మార్‌ మల్లన్నకు ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఆయన నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ జి.చిన్నారెడ్డి పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి.
⚠️ You are not allowed to copy content or view source