'విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి'
NEWS Feb 28,2025 11:46 pm
MBNR: రానున్న 20 రోజులు పదవ తరగతి విద్యార్థులు చదవడం, రాయడం పై దృష్టి పెట్టాలని రాష్ట్ర విద్యా శాఖ ఆర్జేడి విజయలక్ష్మి సూచించారు. తలుపు తట్టండి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం మరికల్ మండలం మాద్వార్ గ్రామంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి పేరెంట్స్ తో మాట్లాడారు.