మార్చి 22 నుంచి ఐపీఎల్ షురూ
NEWS Feb 28,2025 10:46 am
బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. అత్యంత జనాదరణ పొందిన టాటా ఐపీఎల్ 2025 టోర్నీ మార్చి 22 నుంచి ప్రారంభం అవుతుందని వెల్లడించింది. 25వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపింది. మొత్తం 10 జట్లు ఈ సీజన్ లో పాల్గొంటాయని పేర్కొంది. ఈసారి గెలుపొందే జట్టుకు భారీ ఎత్తున నజరానా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐపీఎల్ ను వీక్షించనున్నారు. ఫుట్ బాల్ తర్వాత ప్రాముఖ్యత కలిగిన ఆటగా ఐపీఎల్ నిలిచిందని తెలిపారు బీసీసీఐ కార్యదర్శి జే షా.