ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి భేటీ
NEWS Feb 26,2025 04:32 pm
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఈ సందర్బంగా కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద జరిగిన ఎస్ఎల్బీసీ ఘటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వివిధ రాష్ట్ర ప్రాజెక్టుల గురించి కూడా చర్చించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన పెండింగ్ సమస్యలతో పాటు, వివిధ రాష్ట్ర ప్రాజెక్టులపై ఏకరువు పెట్టారు సీఎం.