పథకాలు నేరుగా రైతులకు చేరవేయాలి
NEWS Feb 26,2025 09:15 am
NRPT: ప్రభుత్వం అమలు చేసే పథకాలను రైతులకు చేరే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులను ఆదేశించారు. నారాయణపేట కలెక్టరెట్లో వ్యవసాయశాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పీఎం కిసాన్కు పోర్టల్లో నమోదు చేసుకున్న రైతుల వివరాలను ధృవీకరించాలని, కేవైసీ చేసుకొని రైతులను గుర్తించి చేయించాలని చెప్పారు.