Logo
Download our app
బంగాళా ఖాతంలో భూకంపం
NEWS   Feb 25,2025 08:43 am
బంగాళాఖాతంలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 6.10 గంటలకు రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.1 తీవ్రత‌తో భూకంపం సంభవించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ (ఎన్‌సీఎస్‌) తెలిపింది. భూకంపం తీవ్రత కారణంగా బంగాల్​, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. బంగాళాఖాతంలోని సముద్ర గర్భంలో 91 కి.మీ లోతున భూకంపం సంభవించినట్లు ఎక్స్​ వేదికగా ఎన్​సీఎస్ పోస్ట్​ చేసింది. మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source