కూటమి ప్రభుత్వం రైతులకు శాపం
NEWS Feb 23,2025 04:52 pm
ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. కూటమి సర్కార్ రైతులను ఆదుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. మిర్చి రైతులను నిట్ట నిలువునా ముంచిందని మండిపడ్డారు. ఎర్ర బంగారం ఏడిపిస్తోందన్నారు. నష్టాల ఘాటుకు రైతులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారంటూ వాపోయారు. పెట్టుబడి మందం రాక అడ్డికి పావుషేరు కింద అమ్ముకుంటూ నష్టాల పాలవుతున్న రైతులకు భరోసా ఇవ్వాల్సిన సీఎం సొల్లు కబుర్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.