చంద్రన్న పగ..దగా ఇకపై చెల్లదు
NEWS Feb 23,2025 07:55 am
వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రన్న పగ, చంద్రన్న దగా అనే పథకాలను ప్రస్తుతం అమలు చేస్తున్నాడని మండిపడ్డారు. కూటమి సర్కార్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా తనను నియమించడం పట్ల జగన్ కు థ్యాంక్స్ తెలిపారు.